శ్రీఫలము | మారేడు చెట్టు | మారేడు కాయ | Maredu | Bael | Aegle marmelos | Maredu Chettu | Maredu Kaya | Maredu Dalam | Maredu Dhalam | Maredu Patri | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti

లక్ష్మీదేవి కుడిచేతితో
   సృష్టించిన చెట్టు మారేడు చెట్టు.

అందుకే 
ఆ చెట్టుకు పండిన కాయను
‘శ్రీఫలము’
అని పిలుస్తారు.
సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. 
అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.
మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి
దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. 
మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. 
ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది.
అందుకే
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!
అని
తలుస్తాము.
దళములు దళములుగా ఉన్నవాటినే కోసి 
పూజ చేస్తారు.
ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.
అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. 
అది మూడు, 
తొమ్మిది కూడా ఉంటాయి. 
పుష్పములను
పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి.
కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా 
ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. 
మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.
అందులో 
మారేడు దళము ఒకటి.
మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె 
శివలింగమునకు తగిలితే 
ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.
అందుకే 
ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, 
పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా
మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు.

శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.
‘బాల్యం, 
యౌవనం, 
కౌమారం 
ఈ మూడింటిని నీవు చూస్తావు’
అని ఆశీర్వదిస్తాడుట.
కాబట్టి
ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. 
శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.
మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది.
ఇంత శక్తి కలిగినది కాబట్టే
దానికి "శ్రీసూక్తం"లో
‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’
(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక)
అని చెప్తాము.

మనిషికి మూడు గుణములు, 
మూడు అవస్థలు ఉంటాయి.
నాల్గవదానిలోకి వెళ్ళడు. 
నాల్గవది తురీయము.
తురీయమే జ్ఞానావస్థ.
అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.

మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే
మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే.

ఇంట్లో మారేడు చెట్టు ఉంటె 
ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా>> అపారమయిన సిద్ధి కలుగుతుంది.

యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు 
ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే  అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.
శాస్త్రము మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది.
మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.
అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.
‘మా-రేడు’
తెలుగులో 
రాజు ప్రకృతి, 
రేడు వికృతి. 
మారేడు అంటే మా రాజు. 
ఆ చెట్టు పరిపాలకురాలు.
అన్నిటినీ 
ఇవ్వగలదు.
ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.
అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.
ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు 
పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. 
అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.
అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా >>మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.
అందులో
1 మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,
2 రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,
3మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. 
ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment