శ్రీ లలితా దివ్య రహస్యసాహస్రనామస్తోత్రం
శ్రీ భాస్కరరాయ ప్రణీతం
సౌభాగ్య భాస్కర భాష్యం
Sri Lalitha Divya Rahasya Sahasranamastotram
Sri Bhaskararaya pranitam
Sowbhagya BhaskaraBhashyam
-Nori Bhogeswara sarma
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
సౌభాగ్య భాస్కరభాష్యం
ReplyDeleteప్రతి నామమునకు అర్థముతో కూడిన వివరణ, సంస్కృతంలో భాస్కరరాయలు ఇచ్చిన నిర్వచనములు ఒక అనిర్వచనీయ అనుభూతిని కలిగించాయి. శ్రీ నోరి భోగీశ్వర శర్మ గారిని ఆ లలిత పరాభట్టరిక సదా రక్షించుగాక.
మంగళం మహత్
ఈ పుస్తకం onlin లో చదవడానికి అవకాశం ఉంటే దయచేసి ఆ link share చేయండి, లేదా pdf download చేసుకోవటానికి అవకాశం ఉంటే ఆ link ఐనా share చేయండి
ReplyDeletehttps://devullu.com/books/sowbhagya-bhaskararaya-bhashyam/
DeleteSir online lo ela open cheyali avatle du
Deletehttps://devullu.com/books/sowbhagya-bhaskararaya-bhashyam/
ReplyDeleteSuhashini samagri 9 rakamulu vati perlu cheppindi
ReplyDelete------భాస్కరాచార్యులు------
ReplyDeleteలలితాసహస్రానికి అనేకమంది వ్యాఖ్యలు వ్రాశారు. వాటన్నింటిలోకి మొట్టమొదటిది. మూలమైనది భాస్కరరాయలవారు వ్రాసిన “సౌభాగ్య భాస్కరము”. తరువాత వచ్చిన వ్యాఖ్యలన్నింటికీ ఇదే మాతృక అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. వీరు క్రీస్తుశకం 17-18 శతాబ్దాల మధ్య జీవించారు.
కర్ణాటక రాష్ట్రంలోని బీజపూరు నందు బీజపూరు నవాబుకు విశ్వామిత్ర గోత్రీకుడైన గంభీరరాయ దీక్షితులు మంత్రిగా ఉండేవాడు. గంభీరరాయలు మహాపండితుడు. సోమయాజి, బహు గ్రంథకర్త, రాజనీతిజ్ఞుడు. మహాభారతాన్ని పార్శీభాషలోకి అనువదించి “భారతి” అని బిరుదు పొందాడు. ఈయన భార్య కోనమాంబ. రాచకార్యము మీద ఈయన హైదరాబాదు నగరానికి వచ్చినప్పుడు అక్కడ ఈ పుణ్యదంపతులకు భాస్కరరాయలు జన్మించాడు.
బాలభాస్కరుడు దినదిన ప్రవర్ధమానుడై నారాయణపేట
దగ్గరగల 'లోకాపల్లి” అనే గ్రామంలో సాక్షాత్తూ సరస్వతీస్వరూపమైన నృశింహయాజి దగ్గర సమస్త విద్యలు అభ్యసించి, ఆ తరువాత సూరత్ నగరవాసి అయిన “ప్రకాశానందనాధ” అనే దీక్షానామంగల శివదత్తశుక్ల దగ్గర ఉపదేశం పొందాడు. గురువు యొక్క అనుగ్రహంతో పరదేవతా సాక్షాత్కారం పొందిన భాస్కరాచార్యుడు దేశాటన చెయ్యటం ప్రారంభించాడు.
ఆ రోజుల్లో మహారాష్ట్ర దేశానికి సేనాధిపతి అయిన “చంద్రసేన జాదవు”
భాస్కరాచార్యుని శిష్యుడైనాడు. చంద్రసేనుడికి సంతానం లేదు. అందుచేత అతడు భార్యతో సహా గురువుగారైన భాస్కరాచార్యుని దగ్గరకువెళ్ళి, సంతానాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. కరుణామయుడైన భాస్కరాచార్యుడు చంద్రసేనుడికి పుత్రసంతానం కలుగుతుంది అని దీవించాడు. కాలక్రమంలో చంద్రసేనుడి భార్య గర్భవతి అయింది.
ఆ రోజులలో నారాయణదేవుడు అనేవాడు భాస్కరునికి శిష్యుడుగా ఉండేవాడు.
అతడు పండితుడు, సద్గుణసంపన్నుడు. అన్నిటికీ మించి గురువుగారి మీద అచంచలమైన
భక్తిప్రపత్తులు కలవాడు. నారాయణదేవుని యొక్క దీక్షకు మెచ్చి భాస్కరాచార్యుడు అతడికి
వాగ్దేవీ మంత్రాన్ని ఉపదేశించాడు. గురుకటాక్షవీక్షణాల వల్ల మంత్రసిద్ధి జరిగి
నారాయణదేవుడికి వాక్సిద్ధి లభించింది. ఈ రకంగా వాక్సిద్ధిని పొందిన నారాయణదేవుడు
కూడా దేశాటన చేస్తూ మహారాష్ట్ర ప్రాంతంలో చంద్రసేనుడున్న నగరానికి వచ్చాడు.
అతడి గొప్పతనాన్ని విన్నటువంటివాడై చంద్రసేనుడు అతని వద్దకు వెళ్ళి, తన భార్య గర్భవతి అని చెప్పి, తనకు ఏ సంతానం కలుగుతుంది ? అని అడిగాడు. దానికి
నారాయణదేవుడు స్రీ సంతానము కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే
చంద్రసేనుడు “అయ్యో ! అదెలా జరుగుతుంది ? మా గురువుగారు భాస్కరాచార్యుల
వారు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు కదా !” అన్నాడు. ఆ మాటలు వినగానే
నారాయణదేవుడు ఎక్కడో పొరపాటు జరిగిపోయిందని గ్రహించి “ఓ మూర్చుడా ?
భాస్కరాచార్యుల వారే నాకు కూడా గురువుగారు. వారి దయవల్లనే నాకు వాక్సిద్ధి
లభించింది. అటువంటి నాతో వేరేరకంగా చెప్పించావు. కాబట్టి నీకు ఆడామగా కాని
శిశువు జన్మిస్తుంది.” అని శాపం పెట్టాడు.
చంద్రసేనుడు తను చేసిన పనికి
ReplyDeleteవిచారించసాగాడు. కొంతకాలానికి చంద్రసేనుని భార్య ప్రసవించింది. నారాయణదేవుడు
చెప్పినట్లే నపుంసకుడు జన్మించినాడు. ఈ పరిణామానికి చంద్రసేనుడు విపరీతంగా
దుఃఖించసాగాడు. కొంతకాలానికి భాస్కరరాయలవారు 'భలాకి” అనే నగరానికి వచ్చినట్లుగా
తెలిసి, కుమారుణ్ణి వెంటపెట్టుకుని అక్కడకు వెళ్ళి గురువుగారి పాదాలనాశ్రయించి,
నపుంసకుడైన తన కుమారుని పురుషుడుగా చెయ్యమని కోరాడు. కరుణాంతరంగుడైన
భాస్కరాచార్యుడు రామచంద్ర జాదవుడనే పేరు గల ఆ బాలుణ్ణి వెంటపెట్టుకుని కృష్ణాతీర
మందలి “మలీమడుగు” అనే పుణ్యక్షేత్రానికి పోయి కృష్ణలో నిత్యనుష్థానము మొదలుపెట్టాడు.
మలీమడుగు నుంచి కృష్ణానది కొంచెం దూరంగా ఉన్నది. ప్రతిరోజూ ఆచార్యుడు
నదీ తీరానికి కాలినడకన ఏగి అనుష్టానం పూర్తి చేసుకుని వస్తుండేవాడు. ఇలా చెయ్యటం
వల్ల అతడి కాళ్ళు బొబ్బలెక్కి పుండ్లు పడిపోసాగాయి. అది చూసిన శిష్యులు “గురుదేవా!
మన నివాసం నదీతీరానికి మారుద్దాం !” అన్నారు. ఆ మాటలు విన్న భాస్కరుడు
“కృష్ణానదినే మన దగ్గరకు రప్పిద్దాం” అన్నాడు. దానికోసం మరునాటి నుండి సూర్యోపాసన
ప్రారంభించాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమై భాస్కరాచార్యుని కోరిక తెలుసుకుని,
“బ్రహ్మ యొక్క సృష్టిని ఎదిరించటం కూడని పని. రామచంద్రుడికి పుంసత్వాన్ని నేను
ప్రసాదిస్తాను. ఆ పని మానుకో” అన్నాడు. ఆ మాటలు విన్న భాస్కరాచార్యుడు కుపితుడై,
“రామచంద్రుణ్ణి పురుషునిగా చెయ్యగల సామర్థ్యం నాకున్నది. నేనడిగినట్లుగా నువ్వు
కృష్ణానదిని మళ్ళించు లేకపోతే సూర్యోపాసన ప్రయోజనం లేనిది అని ప్రచారం చేస్తాను”
అన్నాడు. ఆ మాటలు విన్న సూర్యభగవానుడు భాస్కరుని కోరిక మన్నించి, నదీ ప్రవాహాన్ని
మలీమడుగుకు మళ్ళించాడు. ఆ సందర్భంలోనే భాస్కరాచార్యుడు “తృచభాస్కరము”
అనే (గ్రంథాన్ని రచించాడు. తరువాత భాస్కరుని ఉపాసనతో రామచంద్రుని నపుంసకత్వం కూడా పోయింది. దీనికి ఆనందించిన రామచంద్రుని తండ్రి చంద్రసేనుడు మలీమడుగు
గ్రామాన్ని భాస్కరునకివ్వగా, భాస్కరాచార్యుడు ఆ గ్రామాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చాడు.
ఆ గ్రామంలో చింత చె
ట్లు ఎక్కువగా ఉండేవి. అందుచేత చింతకాయలను ఎవరూ
అమ్మరాదు. ఎవరికి కావలసినవి వారు కోసుకుని వాడుకోండి. ఒకవేళ ఎవరైనా వాటిని
అమ్మాలని చూస్తే, వాటిలో పురుగులు వస్తాయి. అని ఆంక్ష పెట్టాడు భాస్కరుడు.
భాస్కరాచార్యుడు శంకరాచార్యుని పరంపరగా అద్వైతమతాన్నే ప్రచారం చేశాడు.
ReplyDeleteఆ రోజులలో సత్యబోధస్వామి మధ్వమఠాధిపతిగా ఉండేవాడు. భాస్కరాచార్యుడు
దేశాటనచేస్తూ సత్యబోధస్వామిని వాదనలో జయించాడు. ఈ సత్యబోధుని సోదరుని
కుమార్తె పార్వతి. శాస్త్రప్రకారము ముద్రాంకితురాలు. మధ్వ సంప్రదాయంలో శంఖు
చక్ర ముద్రలు వేయించుకున్న వారే సంప్రదాయులు. అటువంటి ఆమెకు ప్రాయశ్చిత్తం
చేయించి స్మార్తవిధిని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ రకంగా మధ్వుల కుమార్తెను
వివాహమాడాడు కాబట్టి మధ్వులు భాస్కరుడికి వ్యతిరేకులైనారు.
ఆ రకంగా దేశాటనచేస్తూ క్రీశ 1750 ప్రాంతంలో కాశీక్షేత్రానికి వచ్చి
"సౌభాగ్యభాస్కరము' అనే పేరుతో లలితా సహస్రానికి భాష్యం ప్రాశాడు. ఆ రోజులలో
కాళీక్షేత్రంలో ఉన్న పండితులకందరికీ ఈ విషయం బాధాకరంగా తయారయి వారంతా
ఒకచోట చేరి భాస్కరాచార్యుణ్ణి పరీక్షించాలి అనుకున్నారు. అప్పటి పండితులలో
కుంకుమానందస్వామి చాలా ప్రసిద్ధుడు. అందుచేత కాశీలోని పండితులందరూ ఆతని
అనుజ్ఞ తీసుకుని భాస్కరుని దగ్గరకు వచ్చి “అయ్యా ! మీరు పరదేవతాకటాక్షంతో లలితా
సహస్రానికి భాష్యం ప్రాశారు అని చెబుతున్నారు. అలాగయినప్పుడు ఆ దేవి 'మహాచతుపషష్టి
కోటియోగినీ గణసేవితా” అని చెప్పబడిందికదా. ఆ నామంలో ఉన్న యోగినీ దేవతల
పేర్లు, రూపాలు, వారి చరిత్రలు వివరించండి” అన్నారు. వారి మాటలు విన్న భాస్కరుడు
“అయ్యా మీరందరూ మీమీ పనులు పూర్తిచేసుకుని సాయంకాలం గంగానదీ తీరానికి
రండి. నేను కూడా అక్కడికి వస్తాను. ఆ ప్రదేశంలోనే మీ సంశయం కూడా తీరుస్తాను”
అన్నాడు. సరే అన్నారు. పండితులు సాయంకాలం నిర్ణీతసమయానికి ముందుగానే
వచ్చారు. పండిత లోకమంతా గంగాతీరాన చేరింది. అప్పుడు వారిలోనుంచి ఒక
పండితుడు లేచి, “ఆర్యా ! చతుషష్టి కోటియోగినీ దేవతల రూపాలను వివరించండి”
అన్నాడు. అప్పుడు భాస్కరులవారు, పండితులందరినీ సావధానులు కమ్మని చెప్పి యోగినీ
చరిత్ర వివరించటం ప్రారంభించారు. అప్పుడు అనేక గొంతులతో, అనేక స్వరాలతో ఆశ్చర్యబోయింది. ఒకే మనిషి ఒక్కసారిగా అన్ని గొంతులతో ఎలా మాట్లాడగలడో
అర్ధం కాలేదు వారికి. ఏమీ మాట్లాడలేక అక్కడ నుంచి కుంకుమానందస్వామి దగ్గరకు
వెళ్ళి, జరిగినదంతా చెప్పి అదెలా సంభవమో చెప్పమని ప్రాధేయపడ్డారు. ఆ మాటలు
విన్న కుంకుమానందస్వామి చిరునవ్వుతో తన కమండలంలోని నీళ్ళతో పండితులకళ్ళు
తుడిచి ఇప్పుడు చూడండి అన్నాడు. గంగానదిలో ఆకాశభాగంలో యోగినీదేవతలు
వారివారి వాహనాలు ఎక్కి వారి చరిత్రలు వారే చెబుతున్నారు. ఆ సమయంలో
భాస్కరాచార్యుని కుడిబుజం మీద లలితాదేవి, ఎడమభుజం మీద శ్యామలాదేవి కూర్చుని
ఉన్నారు. ఆ దృశ్యం చూసిన పండితులనోట మాటరాలేదు. భాస్కరాచార్యుని శక్తి
గమనించిన వారందరూ వెంటనే అతని పాదాలు పట్టుకుని క్షమించమని వేడుకున్నారు.
అంతేకాకుండా భాస్కరాచార్యులు పరదేవతా స్వరూపులని, సౌభాగ్య భాస్కరము అత్యంత
ప్రమాణగ్రంథమని విశ్వసించారు.
క్రీస్తు శకము 1700-1768 మధ్యకాలంలో భాస్కరాచార్యులవారు సౌభాగ్య
భాస్కరము, సేతుబంధము, చండాభాస్కరము, తృచభాస్కరము, వరివస్యా రహస్యము
మొదలైన 438 గ్రంథాలను రచించారు. భాస్కరరాయలవారి గురించి అతని శిష్యుడు
జగన్నాధుడు 'భాస్కరవిలాస కావ్యము” అనే గ్రంథాన్ని కూడా ప్రాశాడు.
భాస్కరాచార్యుడు వేదవిదుడు. సకలశాస్త్రాలు క్షుణ్ణంగా చదివినవాడు. శ్రీవిద్యా
సంప్రదాయంలో పూర్ణదీక్షాపరుడు. దక్షిణాచార సంపన్నుడు. గ్రంథాలను వ్రాసేటప్పుడు
వాటిలో ఉన్న రహస్యాలను వివరించాలి కాబట్టి వామాచార పద్ధతులను కూడా
వివరించారు. దీనిని బట్టి వారు అన్ని ఆచారాలను, సంప్రదాయాలను పూర్తిగా తెలిసినవారు
అని తెలుస్తుంది. ఆయన మాత్రం స్వయంగా దక్షిణాచార సంపన్నుడు. మహామంత్రవేత్త.
భాస్కరరాయలవారి తండ్రిగారైన గంభీరరాయలవారు మహాభారతాన్ని పార్శీభాషలోకి
అనువదించారు అనీ, ఆ సందర్భంగా వారికి 'భారతి” అని బిరుదు ప్రదానం చెయ్యటం
జరిగింది అని ముందే చెప్పాము. కొన్నిచోట్ల ఈ బిరుదులు కాలక్రమేణా ఇంటి పేర్లుగా
మారిపోతుంటాయి. మన ప్రాంతంలో శ్రీమాన్” అనే బిరుదు ఈ రకంగా మారినదే.
అదేవిధంగా “భారతి” అనే బిరుదు కూడా 'భారతుల” అయి ఇంటి పేరయింది. ఈ రోజున
భారతుల అనే ఇంటిపేరుగల వారు కృష్ణానదీప్రాంతంలో ఉన్నారు. వీరు వైదిక
బ్రాహ్మణులు. తెలగాణ్యులు. ఇన్ని గ్రంథాలు వ్రాసిన పరదేవతాస్వరూపమైన
భాస్కరాచార్యుడు కృష్ణాతీరవాసి, వైదికబ్రాహ్మణుడు. విశ్వామిత్రగోత్రీకుడు, ప్రత్యేకించి
ఆంధ్రుడు కావటం మన పూర్వజన్మల పుణ్యఫలం.
How many sahasranamas are there of god's in this book
Delete