గోమాత చరిత్ర | గోవు చరిత్ర | గో మాహత్యం | Gomata charitra | govu charitra | go mahatyam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

గోమాత చరిత్ర | గో మాత వైభవం
 గోవు చరిత్ర | గో మాహత్యం
 Gomata charitra 
 Govu charitra 
Go mahatyam  
Rs 63/-

గో పూజ మహత్యం


    హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.
గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.
అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.
అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.
ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.
పూర్వం సాధువులు అధికంగా గోవు (ఆవు)కు పూజలు జరుపుతుండేవారు. వివిధ మఠాల పీఠాధిపతులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి సాధువులందరూ ఇష్టపడి చేసే పూజ గోపూజ. త్రిమూర్తులు, సకల దేవతలు గోవుమాతపైనే కొలువై ఉన్నట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
దేవలోక గోవు పటాన్ని గమనించినట్లైతే అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్టు చూడవచ్చు. అందువల్లనే ఇప్పుడు కూడా చాలా మంది గోవు తోకను స్పర్శించి ప్రార్థిస్తుంటారు. గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువుండటం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు.
విజ్ఞాన పరంగా చూసినట్లైతే గోవు పంచితం క్రిమి సంహారిగాను (రసాయ పదార్థం) ఉపయోపడుతుంది. అంతేకాకుండా గోవు ఇచ్చే పాలు తల్లితో పాటు శ్రేష్టంగా ఉండటం గమనించవచ్చు. గోవు శాఖాహారిగాను, సాధు జంతువుగా ఉన్నందునే కాకుండా, అది మనకు ఉపయోగకారిగా ఉన్నందునే దాన్ని మన గృహాల్లో పెంచుకుంటున్నాము.
కామోద్రేక్తంతో చేసే తప్పుల వలన కలిగే దోషాలను కూడా గోపూజ ద్వారా నివారించుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనడం జరిగింది. అంటే గోవును పూజించడం మాత్రమే కాకుండా గోవును దేవాలయానికి దానంగా ఇవ్వడం, గోవు వలన మనకు సిద్ధించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలను ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా గోపూజతో సమానమేనని పండితులు భావిస్తున్నారు.
అలాగే దేవ రహస్యాన్ని కనుగొనే మహత్మ్యం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అందువల్లే గోపూజకు శాస్త్రాల్లో కీలక ప్రాముఖ్యత సంతరించుకుంది.
''కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా.....
గోవు కూడా జంతువే కానీ....
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.
నీ చదువు...
నీ సంస్కారం...
నీ విచక్షణ...
నీ విజ్ఞత...
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే...
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా
* ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.
అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.
ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.
మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.
* ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి.
* విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
* వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
* ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
* కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
* గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.
* గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
* ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.
* ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
* ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.
* గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
''గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''.
- గాంధీజీ.
''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''.
- మహ్మద్ ప్రవక్త.
''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''.
- ఏసుక్రీస్తు.
''గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము''.
- హజరత్ మహమ్మద్.
''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును''.
- బర్మార్డ్ మేక్ ఫెడన్.
''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''.
- హకీల హజ్మల్ ఖాన్.
''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''.
- తోహస్-వి-హింద్ బిజహరు.
భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?
నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.
నా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.
స్వేచ్ఛంటే....
''నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు''
''నా(నీ,ఈ)దేశం మెచ్చేటట్టు బ్రతకడం''
--------------------

గోరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

భారతీయ సాంప్రదాయంలో ఉదయాన్ని నిద్రలేవగానే మున్ముందుగా భూమాతకు వందన మాచరించి, కన్నతల్లి పాదాలకు నమస్కరించి, గోశాలలో ఉన్న గోమాత పృష్ఠ భాగాన్ని కనులకద్దుకుని భక్తిని ప్రకటించడం విధిగా పేర్కొనడం జరిగింది. పలు పుణ్యక్షేత్రాల్లో సుప్రభాత సేవా కాలంలో గోమాతను స్వామివారి సన్నిధిలోనుంచిన తరువాతనే తలుపులు తీస్తారు. అంటే భగవంతునికే భగవత్స్వరూపం గోమాత.

పూర్వకాలంలో గోవు లేని ఇల్లు ఉండేది కాదు. గోవు ఇచ్చిన పాడిపంటలతో పసిపాపల మొదలుకొని వృద్ధుల వరకు నిండు ఆరోగ్యంతో మసిలేవారు. ఏనాడు సిరి లేదు వాపోయేవారు కారు. వశిష్ఠుడు తన దగ్గర ఉన్న కామధేనువు వల్లే విశ్వామిత్రుని వంటి మహారాజును కూడా ఓడించగలిగాడు. కేవలం సిరిసంపదలకే కాదు గోవు ఇచ్చే సంపదలకు అపార ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి కూడా పనికి వస్తాయ.

‘‘్ధను సదనం రజీణాం’’- సర్వసంపదలకు మూలము గోవు అన్నది అధర్వణ వేదం.
‘‘మహాస్తపేవ గోర్మహిమా’’- గోవును గురించి ఎంత చెప్పినా అది తక్కువే అంటుంది శతపథ బ్రాహ్మణం.
‘‘తృణోదకాది సంయుక్తం యః ప్రపద్యాత్ గవాహ్నికమ్
సోగ్మేధ సమం పుణ్యం లభతే నాత్ర సంశయః’’

పరాశర స్మృతి వచనం. అంటే రోజూ కాస్త గడ్డి తినిపించి, నీరు త్రాగిస్తే అలా సంరక్షించే వానికి అశ్వమేధయాగం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది. రాజులున్న కాలంలో గోసంపద ననుసరించే వారి భోగభాగ్యాలు వర్థిల్లేవి.

గోమాతపై గౌరవం పూజ్యభావం భారతీయుల రక్తంలో అణువణువునా ప్రవహిస్తూ ఉంటుంది. కన్నతల్లికిచ్చే గౌరవానే్న గోమాతకు కూడా ఇస్తారు. కనుక కన్నతల్లిని ఏవిధంగా రక్షించుకుంటామో గోమాతను కూడా రక్షించుకోవలసిన అవసరం నేడు కనిపిస్తోంది.
‘‘లోక కళ్యాణం కోసం భగవంతుడు మానవులకిచ్చిన వరప్రసాదం గోవు. గోవు పట్ల మానవులు చూపే ప్రేమను గ్రహించి అంతకు పలు రెట్లు అధికంగా మనకు ఫలాలను ఇస్తుంది గోమాత’’ అంటారు ఆచార్య వినోబాభావే.’’

మన ప్రాచీన ఋషులు గోమాతను గురించి ఆధ్యాత్మిక పరంగా, విజ్ఞాన శాస్తప్రరంగా చెప్పిన విషయాలు పాశ్చాత్య పండితులు, విజ్ఞాన శాస్తవ్రేత్తలు పరిశీలించి, పరిశోధించి భారతీయ ఋషుల ప్రజ్ఞను కొనియాడేరు.

గోవును దేవుని స్వరూపంగా భావించిన భారతీయులు నేడు గోవులను అభివృద్ధి పరుచుకోవడం లేదు. కనీసం వాటిని రక్షించు కోవడం లోను వెనుకబడి ఉన్నారు. పాశ్చాత్యు లు గోసంపదపై కన్ను వేశారు. ఆ సంపదను కొల్లగొట్టడంలో ఎన్నో ఉపాయాలను పన్ను తున్నారు. అటువంటి వారి నుంచి మన గోవులను మనం రక్షించుకుని తీరాలి. గోమాంస విక్రయం, భక్షణలతో సంపదను పెంచుకోవచ్చునని చెప్పడం హాస్యాస్పదం. గోవులను రక్షించుకోవడంలోనే సంపదవృద్ధి చెందుతుందని చరిత్ర చెబుతుంది. చరిత్ర పుటలను తిరగవేస్తే గోసంరక్షణ ఎంత అవసరమో తెలుస్తుంది. కనుక ఎవరికి వారు ప్రతిన బూని గోరక్షణ చేయాలి.

ఎందరో మహానుభావుల గోసంరక్షణ గురించి వారి వారి అభిప్రాయాలను వెలి బుచ్చారు. ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలే కాక ప్రతి మనిషి కూడా గోసంరక్షణ చేయ డానికి అప్రమత్తుడై ఉండాలి. గోసంరక్షణను సగర్వంగా భావించి అవశ్యం చర్యలు చేపడితే, గోసంతతి అభివృద్ధి ప్రకాశవంతమవడమేకాక పాలకులు- పాలితులు ఒక మహాశక్తిగా రూపొందుతారు.

గోమాత చరిత్ర | గోవు చరిత్ర | గో మాహత్యం | Gomata charitra | govu charitra | go mahatyam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

1 comment: