ఆహారం ఆరోగ్యం | Aharam Arogyam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ఆహారం ఆరోగ్యం
 Aharyam Arogyam
Rs 36/-

ఆహార నియమాలు ......

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.

ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.

అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమి నాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.

రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకును గాని, పాత్రను గాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.

రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.

రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి వాడకూడదు. ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.

ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు.

ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి. ( అందువలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా ఉంటుంది )

ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి ( ఘన పదార్ధాలను త్రాగండి అంటారు. అంటే నోటిలోనే సగం నమలబడాలి . అందువలన లాలాజలం పూర్తిగా కలిసి, ముద్దా మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం ( క్షారం ) విరుగుడు గా పనిచేస్తుంది .

ఆహార నియమాలను పాటించే వ్యక్తికి ఔషధాల అవుసరం ఏమి ఉంటుంది ? ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏమి ఫలితాలను ఇవ్వగలవు?

పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి

అంటే రోగికి ఔషధాల అవుసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .

రోగికి ఆహారం పై నియంత్రణ లేక పోతే మాత్రం అత్యుత్తమ మైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .

అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర: ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||

అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.

------------

    అక్కినేని అన్నింటా ఆదర్శమే. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో! ఆయన ఆరోగ్య రహస్యం గురించి అందరికీ తెలిసిన విషయమే అయినా... ఎలా సాధ్యం? మద్రాసు నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చిన వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయం... వీలైనంతవరకూ సేంద్రీయ ఆహారం తినాలని. జూబ్ల్లీహిల్స్‌లోని ఇంటివెనక ఉన్న ఖాళీ స్థలంలో నాలుగు రకాల కూరగాయలు పండించడం హాబీగా పెట్టుకున్న అక్కినేని నేటివరకూ కొనసాగించారు.

    రసాయన ఎరువులు వాడకుండా కేవలం సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయాల్ని తిన్నారాయన. టమోటాలు, బెండకాయలు, కాకరకాయలు, బీరకాయలు, రెండు మూడు రకాల ఆకుకూరలు ఎప్పుడూ ఇంటివెనక గార్డెన్‌లో పండేవి. అప్పుడే కోసిన తాజాకాయగూరలతో వండిన ఆహారాన్ని తినడమే అక్కినేని ఆరోగ్య రహస్యం!

పొలం నుంచి...
   పదేళ్లక్రితం రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ గ్రామంలో ఐదెకరాల పొలం కొన్నారు అక్కినేని. అక్కడ కూడా సేంద్రీయ వ్యవసాయమే చేయించారాయన. అరటిచెట్లు, జామచెట్లతో పాటు ఎప్పుడూ ఐదారు రకాల కూరగాయలు పండేవక్కడ. వాటితో పాటు రెండు ఆవులు కూడా ఉండేవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కినేని ఇంటికి అక్కడి నుంచి కూరగాయలు, పాలు వచ్చేవి. పొలంలో గుమ్మడి, ఆనప పాదులు ఎక్కువగా ఉండేవి. కొంతభాగం ద్రాక్షపంట కూడా పెట్టి నాలుగైదు సంవత్సరాలు పండించారు. ఈ మధ్యనే అక్కడ పేపర్ తయారీకీ పనికొచ్చే యూకలిప్టస్ చెట్లను నాటారు. వాటితో పాటు మామిడి మొక్కలు, నారింజ, బత్తాయి మొక్కలు కూడా వేశారు. కేవలం ఆయన పేరుతో ఒక పొలం, వాటిలో పచ్చని చెట్లు... ఈ సెంటిమెంట్ కోసమే దాన్ని సాగుచేయిస్తున్నారు.

‘   ఆరోగ్యమే మహాభాగ్యమయితే... ఆహారమే దానివెనకున్న పెట్టుబడి అని నమ్ముతాను’ అన్నారు అక్కినేని. నమ్మడమే కాదు... పాటించి చూపించారు! తొంభై ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఆయన పర్సనాలిటీ, ఆయనలోని గట్టితనం, కొట్టొచ్చినట్టు కనిపించే ఆహార్యం వెనకున్న ఒక కారణం సేంద్రీయ వ్యవసాయమైతే, వీలైనంతవరకూ శాకాహారాన్నే తినే ఆయన అభిరుచి మరో కారణం!- భువనేశ్వరి








ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment